Posts

తెలంగాణ అసెంబ్లీలో వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా బిల్లు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:మార్చి 28 తెలంగాణ రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లు సిద్ధం చేసింది, శనివారం శాసన సభలో తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీ తనం పర్యవేక్షణ బిల్లు 2026 ను ప్రవేశపెట్టనుంది... దీంతోపాటు..తెలంగాణ ప్రభుత్వం. సింగరేణి 103, 104వ వార్షిక రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టను న్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ తర్వాత.. తెలంగాణ పంచాయతీ రాజ్‌-2026 అమెండ్మెంట్‌ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు. వృద్ధ దంపతులకు ఆర్థిక భరోసా బిల్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 2026-27 బడ్జెట్‌ గ్రాంట్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకు పద్దుల కేటాయింపుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమాధానం ఇవ్వనున్నారు. ఇక.. గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, స్త్రీ శిశు సంక్షేమశాఖకు పద్దుల కేటాయింపుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇస్తారు.  ఇదిలా ఉంటే.. ఇవాళ, రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ...

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి!l అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానం.

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి అమరావతి :మార్చి 28 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది, ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టారు. ఉదయం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు శాసనసభలో ఈ బిల్లును సీఎం ప్రవేశపెట్టడంతో తీర్మానంపై చర్చ మొదలైంది, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా ఉంచడం అత్యవసరమని, మరియు ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రా నికి స్థిరత్వం వచ్చేలా చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.  తీర్మానంలో కేంద్రాన్ని రాజధానికి చట్టబద్ధత కల్పించమని కోరుతూ కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టత మరియు స్థిరత్వాన్ని ఏర్పరచడం ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశ్యం. అమరావతి రాజధానిగా కొనసాగడానికి అవసర మైన అన్ని రక్షణాత్మక చర్యలను కూడా తీసుకోవాలని తీర్మానంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు సీఎం చంద్రబాబు… ఇది భవిష్యత్తులో రాజధాని పనులు, సౌకర్యాలు, భద్రతా విధానాలకు మద్దతుగా ఉంటుంది. అలాగే, రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణలు చేసి రాజధాని స్థానం విషయంలో స్పష్...

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 28 మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది,ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత అజిత్ పవార్ (66) విమా న ప్రమాదంలో కన్నుమూ శారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం లో ల్యాండింగ్ సమయం లో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.  ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానం లో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయా రు. ఇందులో ఇద్దరు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అయితే డీజీసీఏనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ హఠాత్ప రిణామంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముంబయి నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి అజిత్ పవార్ ఈరోజు ఉదయమే బయలుదేరారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వరుసగా మూడు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే విమానం బారామతి రన్‌వేపై ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. సరిగ్గా 8.45 గంటలకు ఈ ఘోర ప్రమా దం జరిగింది. విమానం అదుపు తప్పి నేలపై కుప్ప కూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఈక్రమంలోనే వి...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలరేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 27  తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది 116 మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, మంగళవారం సాయంత్రం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్ని కల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించు కోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.  ఈ నేపథ్యంలోనే  నేటి నుంచి ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ మెుదలు కానుం ది. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 31న స్క్రూట్నీ, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.  ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరి 12న నిర్వ హించ...

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు గుర్తింపు కాదు…!అక్రిడేషన్ కార్డుతో ముడిపెట్టడం ప్రజాస్వామ్యానికి ముప్పు...! చుంచు కుమార్ అఖిలభారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ చైర్మన్

Image
హైదరాబాద్ ప్రతినిధి | వార్త నేత్రం | జనవరి 26: జర్నలిస్టు గుర్తింపును అక్రిడేషన్ కార్డుతో ముడిపెట్టే ప్రయత్నాలు పెరుగుతున్న ఈ తరుణంలో, అక్రిడేషన్ కార్డు అసలు ఉద్దేశం ఏమిటి? జర్నలిస్టు అంటే ఎవరు? అనే మౌలిక ప్రశ్నలపై సమాజంలో స్పష్టత అవసరమని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గ్రహించకుండా జర్నలిజాన్ని కేవలం కార్డుల పరిధిలో బంధించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అక్రిడేషన్ కార్డు అంటే ఏమిటి? అక్రిడేషన్ కార్డు అనేది ప్రభుత్వం తన పరిపాలనా అవసరాల కోసం జారీ చేసే ఒక అధికారిక గుర్తింపు పత్రం మాత్రమే. ప్రభుత్వ కార్యక్రమాలను కవర్ చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశ సౌలభ్యం కల్పించడం, ప్రభుత్వ పథకాలు, అధికారిక సమాచారం సులభంగా పొందడం వంటి అవసరాల కోసమే ఈ కార్డు ఉపయోగపడుతుంది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే—అక్రిడేషన్ కార్డు జర్నలిస్టు హోదాను నిర్ధారించే ధృవీకరణ పత్రం కాదు. అది కేవలం ప్రభుత్వ వ్యవస్థకు అవసరమైన ఒక పరిపాలనా సాధనం మాత్రమే. జర్నలిస్టు అంటే ఎవరు? జర్నలిస్టు అనేది ప్రభుత్వం ఇచ్చే కార్డుతో తయారయ్యే వ్యక్తి...

వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం: గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 26 మూడు ట్రీలియన్ డాలర్ల ఎకనామి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని, తెలంగాణ గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ, పేర్కొన్నారు. భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న వేళ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా అయన సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  ఈ వేడుకల్లో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి,లు పాల్గొన్నా రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ‘రైజింగ్ తెలంగాణ–2047’ విజన్‌ డాక్యుమెంట్‌ ద్వారా ప్రభు త్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం స్వల్ప కాలంలోనే అద్భుతమైన ప్రగతిని సాధించిందని గవర్నర్ కొనియాడారు.  రాజ్యాంగ విలువలను కాపాడుతూ, అభివృద్ధి మార్గంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థికంగా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఈ ల...

అక్రిడిటేషన్ కార్డుల్లో మహిళలకు 33% తప్పనిసరి!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 26 తెలంగాణ ప్రభుత్వం మీడియా అక్రిడిటేషన్ 2026 నిబంధనాల్లోపలు కీలక సవరణలు చేస్తూ ఇవాళ తాజాగా జీవో నెం.103ను విడుదల చేసింది.  ఈ సవరణల ద్వారా అక్రిడిటేషన్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మరికొన్ని నిబంధనలల్లో ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక మీడియా యాజమాన్యాలు డెస్క్ జర్నలిస్టుల విభాగంలో కనీసం 33% శాతం మహిళలకు అవకాశం కల్పించడాన్ని తప్పనిసరి చేసింది.  అక్రిడిటేషన్ కోటాలో కూడా మహిళా జర్నలిస్టులకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని స్పష్టం చేసింది. 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు, 1.50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో అదనంగా ఒక అక్రిడిటేషన్ కార్డు కేటాయించనున్నారు. 2.5 లక్షల సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు స్పోర్ట్స్, కల్చర్, ఫిలిం విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో ఒక్కో అదనపు అక్రిడిటేషన్ కార్డును సర్కార్ మంజూరు చేసింది. అదేవిధంగా 75 వేల నుంచి 2.5 లక్షల లోపు సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు స్పోర్ట్స్, కల్చర్, ఫిలిం విభాగాల్లో ఏదో ఒకదానిలో రాష్ట్ర స్థాయిలో ఒక అదనపు కార్డును ఇవ్వనున్నారు. అలాగే ఉర్దూ...

నేడు గ్రూప్‌-1 తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

Image
వార్త నేత్రం ప్రతినిధి:  హైదరాబాద్  Jan 22,  నేడు గ్రూప్‌-1 తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ తెలంగాణ : తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్షపై గురువారం తీర్పు వెల్లడించనుంది. ఉదయం 11 గంటలలోపు ఈ తీర్పు వెలువడనుంది. ఈ తీర్పుతో అపాయింట్‌మెంట్ లేటర్లు అందుకున్న 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం తేలనుంది. టీజీపీఎస్సీ 2024లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని, ఫలితాలను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. మూల్యాంకనంలో అక్రమాలు, జెల్‌ పెన్నుల వాడకం, కొన్ని పరీక్షా కేంద్రాల నుంచే ఎక్కువ మంది ఎంపిక కావడం వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పరీక్షలు రద్దు చేయొద్దని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు తుది తీర్పు వెల్లడించనుంది.

త్వరలో మహిళలకు 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు' పంపిణీ!

Image
వార్త నేత్రం ప్రతినిధి: హైదరాబాద్  Jan 22,  త్వరలో మహిళలకు 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు' పంపిణీ! తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి. మహిళలకు 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు' పంపిణీకి ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డులు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ కోసం జీరో టికెట్ పొందుతున్న విషయం తెలిసిందే. చిప్‌తో కూడిన ఈ కార్డులో 16 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. కార్డు ముందు భాగంలో మహిళ ఫోటోతో పాటు పేరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు ముద్రించి ఉంటాయి.

మేడారం భక్తులకు అలర్ట్.. వాట్సప్ లో 'Hi' మెసేజ్ చేస్తే జాతర వివరాలు

Image
వార్త నేత్రం ప్రతినిధి: మేడారం Jan 22,  మేడారం భక్తులకు అలర్ట్.. వాట్సప్ లో 'Hi' మెసేజ్ చేస్తే జాతర వివరాలు తెలంగాణ : మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు ఘనంగా జరగనుంది. అయితే జాతరకు వెళ్లే భక్తులకు కోసం రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. భక్తులు 7658912300 నంబర్కి 'Hi' అని మెసేజ్ చేస్తే లాంగ్వేజ్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన భాషను ఎంచుకొని జాతర సమాచారం, ట్రాఫిక్ &రవాణా అప్డేట్స్, వాతావరణ సమాచారం, అత్యవసర సహాయం వంటి వివరాలు పొందవచ్చు.

నేటి నుండి మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 22 తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు .. ఈనెల 28, 29, 30, 31, తేదీల్లో మహా జాతర జరగనుండగా.. భక్తులకు సౌకర్యనార్థం హన్మకొండ, నుంచి మేడారం వరకు పది రోజులపాటు.. హెలిక్యాప్టర్ సేవలు భక్తులకు అందు బాటులో ఉంటాయని టూరిజం శాఖకు చెందిన అధికారులు తెలిపారు.  ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ మేడారంలో భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది, హనుమకొండ నుండి మేడారం వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి 35 వేల 999 రూపాయలు వసూల్ చేస్తారు. ఇందు కోసం మేడారంలోని పడి గాపూర్, దగ్గర హెలిప్యాడ్, ఏర్పాటు చేశారు.మేడారం ఏరియల్ "వ్యూ" వీక్షించేందుకు హెలికాప్టర్ సేవలు అందు బాటులో ఉంటాయని టూరిజం శాఖ తెలిపింది, టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను మంత్రి సీతక్క గురువారం ప్రారంభించనున్నారు.  కాగా విహంగ వీక్షణ జాయ్ రైడ్స్ కు ఒక్కరికి 4,800 రూపాయలు చార్జితో ఏడు నిమిషాలు హెలికాప్టర్లో ఏరియల్ "వ్యూ" వీక్షించేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి,సర్కార్ భరోసా!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 10 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓ శుభవార్త అందించింది, ఉద్యోగుల సంక్షేమం కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం సాయంత్రం భారీ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది శాశ్వత పర్మినెంట్ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా స్పష్టం చేశారు.  కేవలం ప్రకటనలకే పరిమి తం కాకుండా.. ఈ బీమా పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే లోతైన సంప్రదింపులు జరిపిందని ఆయన వివరించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సవాళ్లు, ఇబ్బందుల ఉన్నప్పటికీ, ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.  గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల ను సైతం తాము అధికారం లోకి వ...

త్వరలో షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: జనవరి 09  చెక్ పోస్టులు ఎత్తేసిన రవాణా శాఖలో మరో కీలక సంస్కరణ అమలుకు సిద్ధమవుతుంది, కొత్తగా వ్యక్తిగత వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది, త్వరలో వాహనం కొనుగోలు చేసిన షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ శాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు.  దీంతో రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఇకపై బైక్, కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో  కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాహనాలు కొనుగోలు చేసిన షోరూమ్ లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేయనుంది, రవాణ శాఖ. ప్రైవేట్ నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఈ కొత్త విధానం అమలు కానుంది. *ఇప్పటివరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్..* ఇప్పటివరకు ఉన్న విధానంలో కొత్త వాహనం కొనుగోలు చేస్తే డీలర్లు కేవలం తాత్కాలిక రిజి స్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఇచ్చేవారు. శాశ్వత రిజిస్ట్రే షన్ కోసం రవాణశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చ...

గవర్నర్ కు బాంబు బెదిరింపు?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 09 పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్ను బాంబు పెట్టి పేల్చివేస్తాం అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో గురువారం అర్ధరాత్రి లోక్ భవన్ రాజ్‌భవన్, వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.  ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది,గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.  అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి.  గవర్నర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనకు హెచ్చరికలు అందాయి. అయితే తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ బెదిరింపును అధికా...

విద్యార్థులకు ఉద్యోగులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 09 తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు వరుసగా ఏడు రోజుల పాటు సెలవులు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 శనివారం నుండి సెల వులు ప్రారంభమవుతాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, మరియు 16న కనుమ పండుగలు ఉన్నాయి. సాధారణంగా కనుమ రోజున ఐచ్ఛిక సెలవు ఉన్నప్పటికీ.. విద్యా ర్థులు తమ స్వగ్రామాలకు వెళ్లే సౌకర్యార్థం 16వ తేదీ వరకు పూర్తి సెలవులు పొడిగించారు.  పండుగ సెలవుల అనంతరం జనవరి 17న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ , ఎయిడెడ్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కాను న్నాయి. కళాశాలలు మాత్రం ఈ నెల 19న ప్రారంభం కానున్నాయి అయితే.. జనవరి 19 న తరగతులు ప్రారంభమైన వెంటనే ప్రాక్టికల్ పరీక్షల సన్నద్ధతపై దృష్టి సారిం చాలని బోర్డు సూచించింది. సెలవుల్లో ప్రత్యేక తరగతు లు...

ప్రియుడు అనుమానించాడని యువతి ఆత్మహత్య?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా జనవరి 08   ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు పెళ్లి చేసుకోవడా నికి తల్లిదండ్రులను ఒప్పించాడు ఫోన్లో ఎవరితో నో  మాట్లాడుతున్నావని వేధించడంతో యువతి వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ లో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం సమీపంలోని కొత్తగూడెం పట్టణానికి చెందిన ఐశ్వర్య (19) తన అన్న అరవింద్‌తో కలిసి తట్టి అన్నారంలొని వైఎస్ఆర్ కాలనీలో అద్దెకు ఉంటోంది. అయితే వీరికి దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్ (23) తో పరిచయం ఏర్పడింది. ఐశ్వర్య ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. కాగా సూర్యాపేటకు చెందిన వీరి దూరపు బంధువైన మహేష్ అలియాస్ ఆనంద్,( 23) నగరంలోని హస్తినా పురంలో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఆనంద్ దూర బంధువు కావడంతో పలుమార్లు ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వచ్చేవాడు వీరిద్దరి మధ్య పరిచయం కూడా ఏర్పడింది..   ఏడాది క్రితం జరిగిన అయ్యప్ప పూజలో ఐశ్వర్యను చూశాడు. అప్పటి నుంచి తరచూ ఐశ్వర్య ఇంటికి వచ్చేవాడు. ఇటీవల ఆమెను ప్రేమిస్తు న్నాన...

ఫిబ్రవరి 1న నిర్మలమ్మ 2026 -27 ఆర్థిక బడ్జెట్!9వ సారి దేశ ఆర్థిక బడ్జెట్: రికార్డ్ సృష్టించబోతున్న నిర్మలమ్మ!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 08 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే 2026-27 ఆర్ధిక సంవత్సర కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారైంది, జన వరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి....  అయితే ఎప్పటిలాగే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్,పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2017 నుంచి ప్రతీ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి ఫిబ్రవరి 1న ఆది వారం వచ్చినా సాంప్రదా యాన్ని కొనసాగించేలా ఆదివారం కూడా సభను నిర్వహించబోతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వరుసగా 9 వ సారి దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డుసృష్టించ బోతున్నారు.. ఈసారి బడ్జెట్ అంచనాలు గతంతో పోలిస్తే భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మూలధన వ్యయం సుమారు రూ"11 నుండి 12 లక్షల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లు,జాతీయ రహదారులు, పోర్టుల, అభివృద్ధికి సింహభాగం నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది. ప్...

నేడు గాంధీభవన్లో టీపీసీసీ కీలక సమావేశం!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 08 రానున్న మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు వ్యూహంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో తీసుకువచ్చిన సవరణలపై నిరసనలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది..  ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ అను బంధ సంస్థల అధ్యక్షులతో ఈరోజు విస్తృతస్థాయి సమావేశాన్ని గాంధీభవన్లో నిర్వహించనుంది...  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,అధ్యక్షత వహించనున్నారు.

పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి నుంచి స్నాక్స్?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 08 తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు వీటిని అందించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి కోసం సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుంచి రూ. 4.23 కోట్లు మంజూరు చేశారు.  అయితే, కేవలం 19 రోజులు మాత్రమే స్నాక్స్ అందించనుండటం పట్ల ప్రభుత్వం తీరుపై విమర్శ లు వెల్లు వెత్తుతున్నాయి రాష్ట్రంలో జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలోని టెన్త్ విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. రాష్ట్రం లో 4,303 హైస్కూళ్లు ఉండగా.. వీటి ల్లో పదో తరగతి విద్యార్థులు 1,48,461 మంది ఉన్నారు.  రోజుకు ఒక విద్యార్థికి స్నాక్స్ కోసం 15 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల వారీగా కేటాయించిన బడ్జెట్ ను వెంటనే ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు విడుదల చేయాలని, అక్కడి నుండి స్కూళ్లక...

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి అమరావతి:జనవరి 07 ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా పోలవరంలో బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయు డు పర్యటించారు.ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పురోగతి పనులపై ఆయన విజిట్ చేశారు.  2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే పట్టుదల తో ఉన్న ప్రభుత్వం, నిర్మాణ దశలను నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని వీక్షించారు. అనంతరం నేరుగా నిర్మాణ ప్రాంతానికి చేరుకుని కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1, గ్యాప్-2 పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఇంజనీర్లను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. నిర్వాసితుల పునరావాస ప్యాకేజీల ఆర్ అండ్ ఆర్, అమలుప...