Posts

Featured Post

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 28 మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది,ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత అజిత్ పవార్ (66) విమా న ప్రమాదంలో కన్నుమూ శారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం లో ల్యాండింగ్ సమయం లో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.  ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానం లో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయా రు. ఇందులో ఇద్దరు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అయితే డీజీసీఏనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ హఠాత్ప రిణామంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముంబయి నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి అజిత్ పవార్ ఈరోజు ఉదయమే బయలుదేరారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వరుసగా మూడు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే విమానం బారామతి రన్‌వేపై ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. సరిగ్గా 8.45 గంటలకు ఈ ఘోర ప్రమా దం జరిగింది. విమానం అదుపు తప్పి నేలపై కుప్ప కూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఈక్రమంలోనే వి...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలరేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 27  తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది 116 మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ లకు సంబంధించి 2026 సాధారణ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, మంగళవారం సాయంత్రం అధికారికంగా విడుదల చేశారు. ఈ ఎన్ని కల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించు కోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.  ఈ నేపథ్యంలోనే  నేటి నుంచి ఎన్నికలు జరిగే పట్టణాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ మెుదలు కానుం ది. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 31న స్క్రూట్నీ, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.  ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరి 12న నిర్వ హించ...

జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు గుర్తింపు కాదు…!అక్రిడేషన్ కార్డుతో ముడిపెట్టడం ప్రజాస్వామ్యానికి ముప్పు...! చుంచు కుమార్ అఖిలభారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ చైర్మన్

Image
హైదరాబాద్ ప్రతినిధి | వార్త నేత్రం | జనవరి 26: జర్నలిస్టు గుర్తింపును అక్రిడేషన్ కార్డుతో ముడిపెట్టే ప్రయత్నాలు పెరుగుతున్న ఈ తరుణంలో, అక్రిడేషన్ కార్డు అసలు ఉద్దేశం ఏమిటి? జర్నలిస్టు అంటే ఎవరు? అనే మౌలిక ప్రశ్నలపై సమాజంలో స్పష్టత అవసరమని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గ్రహించకుండా జర్నలిజాన్ని కేవలం కార్డుల పరిధిలో బంధించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అక్రిడేషన్ కార్డు అంటే ఏమిటి? అక్రిడేషన్ కార్డు అనేది ప్రభుత్వం తన పరిపాలనా అవసరాల కోసం జారీ చేసే ఒక అధికారిక గుర్తింపు పత్రం మాత్రమే. ప్రభుత్వ కార్యక్రమాలను కవర్ చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశ సౌలభ్యం కల్పించడం, ప్రభుత్వ పథకాలు, అధికారిక సమాచారం సులభంగా పొందడం వంటి అవసరాల కోసమే ఈ కార్డు ఉపయోగపడుతుంది. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే—అక్రిడేషన్ కార్డు జర్నలిస్టు హోదాను నిర్ధారించే ధృవీకరణ పత్రం కాదు. అది కేవలం ప్రభుత్వ వ్యవస్థకు అవసరమైన ఒక పరిపాలనా సాధనం మాత్రమే. జర్నలిస్టు అంటే ఎవరు? జర్నలిస్టు అనేది ప్రభుత్వం ఇచ్చే కార్డుతో తయారయ్యే వ్యక్తి...

వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం: గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 26 మూడు ట్రీలియన్ డాలర్ల ఎకనామి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని, తెలంగాణ గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ, పేర్కొన్నారు. భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న వేళ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా అయన సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  ఈ వేడుకల్లో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి,లు పాల్గొన్నా రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ‘రైజింగ్ తెలంగాణ–2047’ విజన్‌ డాక్యుమెంట్‌ ద్వారా ప్రభు త్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం స్వల్ప కాలంలోనే అద్భుతమైన ప్రగతిని సాధించిందని గవర్నర్ కొనియాడారు.  రాజ్యాంగ విలువలను కాపాడుతూ, అభివృద్ధి మార్గంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థికంగా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఈ ల...

అక్రిడిటేషన్ కార్డుల్లో మహిళలకు 33% తప్పనిసరి!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 26 తెలంగాణ ప్రభుత్వం మీడియా అక్రిడిటేషన్ 2026 నిబంధనాల్లోపలు కీలక సవరణలు చేస్తూ ఇవాళ తాజాగా జీవో నెం.103ను విడుదల చేసింది.  ఈ సవరణల ద్వారా అక్రిడిటేషన్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మరికొన్ని నిబంధనలల్లో ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక మీడియా యాజమాన్యాలు డెస్క్ జర్నలిస్టుల విభాగంలో కనీసం 33% శాతం మహిళలకు అవకాశం కల్పించడాన్ని తప్పనిసరి చేసింది.  అక్రిడిటేషన్ కోటాలో కూడా మహిళా జర్నలిస్టులకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని స్పష్టం చేసింది. 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు, 1.50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో అదనంగా ఒక అక్రిడిటేషన్ కార్డు కేటాయించనున్నారు. 2.5 లక్షల సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు స్పోర్ట్స్, కల్చర్, ఫిలిం విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో ఒక్కో అదనపు అక్రిడిటేషన్ కార్డును సర్కార్ మంజూరు చేసింది. అదేవిధంగా 75 వేల నుంచి 2.5 లక్షల లోపు సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు స్పోర్ట్స్, కల్చర్, ఫిలిం విభాగాల్లో ఏదో ఒకదానిలో రాష్ట్ర స్థాయిలో ఒక అదనపు కార్డును ఇవ్వనున్నారు. అలాగే ఉర్దూ...

నేడు గ్రూప్‌-1 తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

Image
వార్త నేత్రం ప్రతినిధి:  హైదరాబాద్  Jan 22,  నేడు గ్రూప్‌-1 తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ తెలంగాణ : తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్షపై గురువారం తీర్పు వెల్లడించనుంది. ఉదయం 11 గంటలలోపు ఈ తీర్పు వెలువడనుంది. ఈ తీర్పుతో అపాయింట్‌మెంట్ లేటర్లు అందుకున్న 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం తేలనుంది. టీజీపీఎస్సీ 2024లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని, ఫలితాలను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. మూల్యాంకనంలో అక్రమాలు, జెల్‌ పెన్నుల వాడకం, కొన్ని పరీక్షా కేంద్రాల నుంచే ఎక్కువ మంది ఎంపిక కావడం వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పరీక్షలు రద్దు చేయొద్దని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు తుది తీర్పు వెల్లడించనుంది.

త్వరలో మహిళలకు 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు' పంపిణీ!

Image
వార్త నేత్రం ప్రతినిధి: హైదరాబాద్  Jan 22,  త్వరలో మహిళలకు 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు' పంపిణీ! తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి. మహిళలకు 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు' పంపిణీకి ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డులు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ కోసం జీరో టికెట్ పొందుతున్న విషయం తెలిసిందే. చిప్‌తో కూడిన ఈ కార్డులో 16 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. కార్డు ముందు భాగంలో మహిళ ఫోటోతో పాటు పేరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు ముద్రించి ఉంటాయి.