Posts

Featured Post

అక్రెడిటేషన్ కమిటీ నిర్ణయాలను నిలిపివేయండి-హైకోర్టులో టీడబ్ల్యూజేఎఫ్ పిటిషన్

Image
హైదరాబాద్, (వార్త నేత్రం: ప్రతినిధి. మే 05: మీడియా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ లు చేసిన, చేయబోయే నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ(ఎస్ ఎంఏసీ), జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ(డీఎంఏసీ)లలో తమ టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులకు అవకాశం కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి అక్రెడిటేషన్ కార్డులపై నిర్ణయాలు చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 252 ప్రకారం కమిటీలో నాలుగు జర్నలిస్టు యూనియన్ లు/సంఘాల ప్రతినిధులు ఉండాలని, కానీ కేవలం మూడు యూనియన్ ల/సంఘాల ప్రతినిధులను మాత్రమే చేర్చి తమ యూనియన్ ప్రతినిధులను తీసుకోకుండా పెండింగ్ పెట్టి ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఈ పిటిషన్ లో ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్, మీడియా అకాడమీ ఛైర్మెన్ లతో పాటు 33 జిల్లాల ప్రజా సంబంధాల అధికారులు (డీపీఆర్వో)లను ప్రతివాద...

త్వరలో టీచర్లకు కొత్త నిబంధనలు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:మే 04 విద్యార్థులకు నిత్యం సమయపాలనతొ పాటు...క్రమశిక్షణ నేర్పించవలసిన ఉపాధ్యాయులే పాఠ శాలలకు ఆలస్యంగా వస్తున్నారని, తెలు స్తుంది, అందరూ కాకపోయినా ఇలా కొద్ది మంది మాత్రం ప్రతిరోజు ఆలస్యం గానే విధులకు హాజ రవుతున్నట్లు హాజరు గుణంకాలే చెప్తున్నా యి.. ఉద్యోగుల హాజరు విషయంలో ఇకనుండి సీరియస్‌గా ఉంటామని,పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.  లేట్‌గా వస్తే క్యాజువల్‌ లీవ్స్‌, ఆర్జిత సెలవు లకు కోత పెడుతామని స్పష్టంచేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని ఉద్యోగు లంతా ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ ఎఫ్‌ఆర్‌ఎస్‌,ను నమోదుచేయాలని తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.  నెలవారీ హాజరు లెక్కింపు విషయం లోఎఫ్‌ఆర్‌ఎస్‌ను పరి గణనలోకి తీసుకుంటా మని స్పష్టంచేసింది. ఉద్యోగులకు ఏడాది లో 15 సాధారణ సెలవులు సీఎల్స్‌, 30 ఆర్జిత సెలవులు ఈఎల్స్‌, ఉంటాయి. విధులకు ఆలస్యంగా వస్తే ముందుగా క్యా జువల్‌ లీవులకు కోత పెట్టనున్నారు. అయి పోయాక ఈఎల్స్‌లో కోత పెడుతారు.  కార్యాలయ సూపరిం టెండెంట్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు కార్యాలయ ఎస్టాబ్లి ష్‌మెంట్‌ విభాగం అధ...

హీరో విజయ్ ప్రభంజనం! .... ఇంటి వద్ద కార్యకర్తల సంబరాలు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:మే 04 తమిళనాడు రాజకీయాల్లో హీరో విజయ్, చరిత్ర సృష్టించబోతున్నారా? తన తొలి ఎన్నికల్లోనే రెండు కీలక నియోజక వర్గాల్లో పోటీ చేసిన ఆయన వారి మెజారి టీతో గెలవబోతున్నా రా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది,ఈరోజు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అయితే తమిళనాడు లో కనీవినీ ఎరగని రీతిలో హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని తెలుస్తుంది.. ఎన్నికల బరిలో దిగిన తొలిసారే.. గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు టీవీకే 108 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగు తోంది. ఈ క్రమంలో తమిళనా డు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118 సాధించి.. అధికారంలోకి వస్తుం దని భావిస్తున్నారు. తమిళనాడులో మొ న్నటి వరకు అధికారం లో ఉన్న డీఎంకే పార్టీ మూడో స్థానంలో కొన సాగుతుండటం గమ నార్హం.పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే విజయ్ టీవీ కే పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం సరికొత్త రికార్డ్ అంటున్నారు.  అయితే విజయ్ పార్టీ గెలుపుకు ప్రధాన కారణం ఎన్నికల వేళ ఆ పార్టీ ఇచ్చిన హామీలే అంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఏడు హామీలు విజయ్‌ ని వ...

దళపతి విజయ్ సర్కార్!

Image
*వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి*  హైదరాబాద్:మే 04 తిరిగి వెళ్లే ఐడియానే లేదు, ఐ యాం కమిం గ్ తన పొలిటికల్ కెరీర్ పై ఇంటు ఇ స్తూ... జననాయగన్, మూవీలో హీరో విజయ్, చెప్పిన డైలాగ్ ఇది అన్నట్టు గానే తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అయన ఎంట్రీ లోనే ప్రజలతో విజిల్ వేయించారు. ఎగ్జిట్ ఫోల్ అంచ నాలను తలకిందులు చేస్తూ తన సర్కార్ ను స్థాపించుకున్నాడు.  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీవీకే పార్టీ స్పష్టమైన ఆధి క్యాన్ని కొనసాగిస్తోంది. దళపతి విజయ్ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. తమిళనాడులో టీవీకే దూసుకెళుతుండటంతో పక్క రాష్ట్రాల రాజకీయ నాయకులు టీవీకే పార్టీ అధినేత విజయ్‌,కు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ రాజకీయా ల్లోకి చారిత్రాత్మకంగా ఎంట్రీ ఇచ్చింది. ఓ స్పష్టమైన ట్రెండ్‌ బలపడుతోంది, అంటు న్నారు ఆయన పార్టీ శ్రేణులు.రాష్ట్ర ప్రయో జనాలకు కట్టుబడి, నిష్పక్షపాతంగా, విశ్వసనీయంగా ఉండే ప్రాంతీయ పార్టీలకు దక్షిణ భారతదేశంలో చోటు ఖాయమనే భరోసాని కల్పిస్తోంద న్నారు.  ఈ ఎన్నికల్లో పాత పార్టీలు చాలా ...

తెలంగాణ అసెంబ్లీలో వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా బిల్లు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:మార్చి 28 తెలంగాణ రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లు సిద్ధం చేసింది, శనివారం శాసన సభలో తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీ తనం పర్యవేక్షణ బిల్లు 2026 ను ప్రవేశపెట్టనుంది... దీంతోపాటు..తెలంగాణ ప్రభుత్వం. సింగరేణి 103, 104వ వార్షిక రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టను న్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ తర్వాత.. తెలంగాణ పంచాయతీ రాజ్‌-2026 అమెండ్మెంట్‌ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు. వృద్ధ దంపతులకు ఆర్థిక భరోసా బిల్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 2026-27 బడ్జెట్‌ గ్రాంట్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకు పద్దుల కేటాయింపుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమాధానం ఇవ్వనున్నారు. ఇక.. గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, స్త్రీ శిశు సంక్షేమశాఖకు పద్దుల కేటాయింపుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇస్తారు.  ఇదిలా ఉంటే.. ఇవాళ, రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ...

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి!l అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానం.

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి అమరావతి :మార్చి 28 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది, ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టారు. ఉదయం సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు శాసనసభలో ఈ బిల్లును సీఎం ప్రవేశపెట్టడంతో తీర్మానంపై చర్చ మొదలైంది, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాజధానిగా ఉంచడం అత్యవసరమని, మరియు ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రా నికి స్థిరత్వం వచ్చేలా చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.  తీర్మానంలో కేంద్రాన్ని రాజధానికి చట్టబద్ధత కల్పించమని కోరుతూ కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై స్పష్టత మరియు స్థిరత్వాన్ని ఏర్పరచడం ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశ్యం. అమరావతి రాజధానిగా కొనసాగడానికి అవసర మైన అన్ని రక్షణాత్మక చర్యలను కూడా తీసుకోవాలని తీర్మానంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు సీఎం చంద్రబాబు… ఇది భవిష్యత్తులో రాజధాని పనులు, సౌకర్యాలు, భద్రతా విధానాలకు మద్దతుగా ఉంటుంది. అలాగే, రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణలు చేసి రాజధాని స్థానం విషయంలో స్పష్...

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 28 మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది,ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత అజిత్ పవార్ (66) విమా న ప్రమాదంలో కన్నుమూ శారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం లో ల్యాండింగ్ సమయం లో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.  ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానం లో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయా రు. ఇందులో ఇద్దరు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అయితే డీజీసీఏనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ హఠాత్ప రిణామంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముంబయి నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి అజిత్ పవార్ ఈరోజు ఉదయమే బయలుదేరారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వరుసగా మూడు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే విమానం బారామతి రన్‌వేపై ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. సరిగ్గా 8.45 గంటలకు ఈ ఘోర ప్రమా దం జరిగింది. విమానం అదుపు తప్పి నేలపై కుప్ప కూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఈక్రమంలోనే వి...