విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 28 మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది,ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత అజిత్ పవార్ (66) విమా న ప్రమాదంలో కన్నుమూ శారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం లో ల్యాండింగ్ సమయం లో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు విమానం లో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయా రు. ఇందులో ఇద్దరు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కాగా, మరో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అయితే డీజీసీఏనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ హఠాత్ప రిణామంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముంబయి నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి అజిత్ పవార్ ఈరోజు ఉదయమే బయలుదేరారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వరుసగా మూడు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే విమానం బారామతి రన్వేపై ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. సరిగ్గా 8.45 గంటలకు ఈ ఘోర ప్రమా దం జరిగింది. విమానం అదుపు తప్పి నేలపై కుప్ప కూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈక్రమంలోనే వి...