Posts

Showing posts with the label vartha nethram

కోచింగ్ కేంద్రాల కాసుల వేట..!

Image
  ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న కోచింగ్ సెంటర్లు.     నిబంధనలు లేవు… నియంత్రణ లేదు.        ఆదిలాబాద్ , వార్త నేత్రం ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీ తీవ్రంగా పెరుగుతున్న ఈ కాలంలో కోచింగ్ సెంటర్ల డిమాండ్ భారీగా పెరిగింది. ఒక్క పోస్టుకు వేలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్న సందర్భంలో యువత , విద్యార్థులు కోచింగ్ కోసం సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కూడా ఎంతటి ఖర్చైనా వెనకాడడం లేదు. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కొన్ని కోచింగ్ సెంటర్లు అధిక ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగులను , వారి తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నాయి. ఐఐటీ , నిట్ , నీట్ , సివిల్స్ , గ్రూప్స్ , పోలీస్ , బ్యాంకింగ్ వంటి కోర్సుల పేరుతో కోచింగ్ సెంటర్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. హాస్టల్ వసతిని ఏర్పాటు చేస్తున్నామంటూ 50 నుండి 60 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సెంటర్లు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. హాస్టల్లో వుంటునా   విద్యార్దులకు   కనీస మౌలిక వసతుల...

తియ్యని విషం ..!

Image
  . స్వీట్లలో హానికర రసాయనాలు – రంగులు . ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఏ‌.ఐ ఆదేశాలు బేఖాతరు . పట్టించుకోని అధికారులు – ప్రజల ఆరోగ్యంతో చెలగాటం  వార్త నేత్రం  ప్రతినిది ఆదిలాబాద్ :  ఇంట్లో పండుగలు, శుభకార్యాలు, వేడుకలు ఏవైనా సరే  ప్రజలు తమ ఆనందాన్ని స్వీట్లతో  పంచుకుంటారు. అయితే ఇప్పుడు ఆ స్వీట్లు మన ఆరోగ్యానికే   ముప్పు తెస్తున్నాయి.  ఆకర్షణీయంగా కనిపించేందుకు కొంతమంది వ్యాపారులు విషపూరిత రంగులు, హానికర  రసాయనాలు కలిపి స్వీట్లు తయారు చేస్తున్నారు. పండగల సీజన్‌లో  అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. ఎక్కువ లాభాల కోసం వ్యాపారులు నాసిరకం నూనెలు,  నెయ్యి వంటివి అధికంగా వినియోగిస్తున్నారు. వ్యాపారుల అత్యాశ వల్ల ప్రజలు అనేక రకాల రోగాల  బారిన పడుతున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన స్వీట్ షాప్‌లు ఇప్పుడు మండలాలు,  గ్రామాలకూ విస్తరించాయి.అంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్దం చేసుకోవచ్చు  పండగల సీజన్‌లో  కిలోల కొద్దీ కాదు, టన్నుల కొద్దీ అమ్మకాలు జరుగుతున్నాయి. వీటి పై  అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు తమ ఇష్టానుసా...

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

Image
 మసాలా గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయ్యాను బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...  అదిలాబాద్ వార్త నేత్రం : బేల మండలంలోని మసాలా గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని.. అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయ్యానని.. ఇందుకు మసాలా గ్రామ ప్రజలు ఎంతో మద్దతు ఇచ్చారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.  మసాలా గ్రామ మాజీ సర్పంచ్  ప్రజలు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆద్వర్యం లో  బిజెపి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి బిజెపి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో శంకరన్న ని  వెంట మేముంటామంటూ ఆనాడు ధైర్యం ఇచ్చారని గుర్తు చేశారు ఇచ్చిన మాట ప్రకారం గానే గ్రామ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగానే మసాలా గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. గత పది ఏళ్ళు కాలంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేనని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల అయిన తర్వాత...

క్రీడలతో మానసిక ఉల్లాసం .... ఎమ్మెల్యే పాయల్ శంకర్

Image
 వార్త నేత్రం అదిలాబాద్ : క్రీడలతో శారీరక దృఢత్వం పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.మంగళవారం జైనథ్ మండలం లోని  ప్రసిద్ధి చెందిన  లక్ష్మి నారాయణ స్వామి జాతర సందర్భంగా  జైనథ్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను  ఎమ్మెల్యే పాయల్ శంకర్   ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... క్రీడల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రత్యేక కార్యచరణను రూపొందించారు అని  గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాలలో క్రీడాకారులకు ఏ విధమైన సౌకర్యాలు కావాలో నివేదికలు తయారుచేసి  వాటికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ చర్చ ప్రస్తావన కొచ్చినప్పుడు వెనుకబడిన అదిలాబాద్ జిల్లాకు విధులు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మండలాలలో మినీ స్టేడియం లో ఏర్పాటు చేస్తుందని చెప్పి ఏ ఒక్కటి కూడా స్టేడియం మంజూరు చేయలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మాటలే ఒకే పరిమితమైందని ఈ ప్రభుత్వం అలాకాక...

డిజిటల్ అరెస్ట్‌ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఈ మూడు స్టెప్స్‌ ఫాలో అవ్వండి’- ప్రధాని మోదీ

Image
ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న ‘డిజిటల్ అరెస్ట్  ’  ఆన్‌లైన్ మోసాలపై దేశ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మోసగాళ్లు తాము పోలీసులం, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమంటూ వీడియో కాల్స్ చేసి, నకిలీ కేసులు నమోదు చేశామంటూ బెదిరించి తమ నుంచి లక్షల రూపాయలు లాగేసుకున్నారని అనేక మంది బాధితులు రిపోర్ట్ చేస్తున్నారు. బాధితులను ఆ మోసగాళ్లు ఎలా బెదిరిస్తారంటే... ‘మీపై కేసు బుక్ చేశాం. ఇంట్లోనే ఒక దగ్గర కూర్చోండి, ఎటూ కదలొద్దు, ఎవరికీ కాల్ చేయొద్దు’ అంటూ ఆదేశాలు ఇస్తారు. భారతీయ చట్టాల్లో ‘డిజిటల్ అరెస్ట్’ అనే ప్రస్తావనే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదంతా మోసగాళ్ల పని అని అన్నారు. భారత్‌లోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అడగదని ప్రధాని తెలిపారు “పోలీసులు, సీబీఐ, నార్కోటిక్స్, ఆర్బీఐ అధికారుల్లా ఆ మోసగాళ్లు నటిస్తుంటారు” అని ప్రధాని మోదీ అన్నారు. పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా దర్యాప్తు సంస్థ కార్యాలయం వంటి సెటప్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసుకుని, అవి వీడియోలో కనిపించేలా మోసగాళ్లు చూసుకుంటారు. అచ్చం నిజమైన యూనిఫామ్స్ లాంటివి ధరిస్తారు. అలాగే, నక...

దుబాయ్‌కి వీసా లేకుండానే వెళ్లొచ్చు, అదెలాగంటే..

Image
  పాస్‌పోర్ట్ కలిగిన భారతీయులకు విమానాశ్రయాల్లో ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని కల్పిస్తోంది యూఏఈ. భారతీయ పౌరులకు ఇప్పటికే పలు దేశాలు ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే, అసలు ‘వీసా ఆన్ అరైవల్’ అంటే ఏమిటి? వీసా-ఫ్రీ దేశాలతో పోలిస్తే ఇదెలా భిన్నమైనది? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. ‘వీసా ఆన్ అరైవల్’ దేశాలకు వెళ్లినప్పుడు మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేమిటనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. వీసా ఆన్ అరైవల్’ అంటే ఏమిటి? మీరు వెళ్లాలనుకుంటున్న దేశం ‘వీసా ఆన్ అరైవల్’ సదుపాయం కల్పిస్తుంటే, మీరు ముందస్తుగా వీసా తీసుకోకుండానే ఆ దేశానికి వెళ్లిపోవచ్చు. ఆ దేశంలోకి వెళ్లిన తర్వాత అక్కడి విమానాశ్రయాలు లేదా నౌకాశ్రయాల్లోనే వీసాను పొందవచ్చు. ఆకస్మిక విదేశీ ప్రయాణాలకు లేదా ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మీరు ఆ దేశంలో ల్యాండ్ అయ్యాక, విమానాశ్రయాల్లో ఉండే ‘వీసా ఆన్ అరైవల్ కౌంటర్’ వద్దకు వెళ్లి, మీ డాక్యుమెంట్లను చూపించి వీసాను తీసుకోవచ్చు. ఒకవేళ మీరు చూపించిన డాక్యుమెంట్లలో ఏమైనా లోపాలుంటే, మీ వీసా తిరస్కరణకు గురవుతుంది. వీసా జారీ ప్రక్రియను సులభత...

యంగ్ ఇండియా జాతీయ సేవా పురస్కార్ అవార్డు అందుకున్న.. అదిలాబాద్ వాసి అబ్దుల్ అజీజ్

Image
 వార్త నేత్రం 29 అక్టోబర్ 2024:   ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన   బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవలను  గుర్తించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన  యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు యంగ్ ఇండియా సేవా పురస్కారం 2024 ప్రకటించి వారికి   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల పంపిణి  కార్యక్రమం లో ఆహుతులు .ఆర్టిసి ఎండి సజ్జనార్ , నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఏలూరు శ్రీనివాసరావు తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్  అసోసియేషన్ అధ్యక్షుడు. మరియు చైర్మన్, ఫౌండర్, ప్రెసిడెంట్ జే.బాలు, వెంకట పుల్లయ్య చీఫ్ అడ్వైజర్ యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ , ల చేతుల మీదుగా బెస్ట్ ఫ్రెండ్స్  హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు  యంగ్ ఇండియా సేవా పురస్కారం జాతీయ అవార్డును  అందుకున్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   ఎక్కడో దూరంగా ఉన్న అదిలాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా   చేస్తున్న  సేవలను గు...

ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి మరియు ఎలా నివారించాలి?

Image
  ఎక్కిళ్ళు (Hiccups) అనేవి మన శరీరంలో జరిగే సహజ ప్రక్రియలలో ఒకటి. ఇవి అనేక కారణాల వల్ల వస్తాయి మరియు సాధారణంగా మన ఆరోగ్యానికి హానికరం కాదు. ఎక్కిళ్ళు రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఆహారం: ఎక్కువగా, త్వరగా ఆహారాన్ని తింటున్నప్పుడు ఎక్కిళ్ళు రావచ్చు. ఈ సమయంలో, డయాఫ్రాగ్మ్ (diaphragm) మసకబారవచ్చు. దీనితో అనుకోకుండా ఊపిరి తీయడం జరుగుతుంది. చల్లని లేదా ఉప్పు ఆహారం: చల్లని పానీయాలు లేదా మసాలా ఆహారాలు తింటే కూడా ఎక్కిళ్ళు వస్తాయి. ఇది పొట్టలో ఆవిరి ఏర్పడటం వల్ల జరుగుతుంది. మానసిక ఒత్తిడి: అంతేకాకుండా మానసిక ఒత్తిడితో కూడిన సందర్భాలలో, ఉదాహరణకు ఉత్సవాలు, ఆందోళన లేదా గందరగోళం కారణంగా కూడా ఎక్కిళ్ళు వస్తాయి. ప్రాణాయామం: ప్రాణాయామం లేదా వేగంగా మాట్లాడడం వంటి కార్యకలాపాలు కూడా ఈ సమస్యను తక్కువ చేసి తేలికపాటుగా చేయవచ్చు. అనంతర ఆరోగ్య సమస్యలు: కొన్ని సందర్భాలలో తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కిళ్ళు రావచ్చు అందువల్ల అవి ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. నివారణ ఎక్కిళ్ళను నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి: తక్కువ భాగాలుగా ఆహారం తినండి. మద్యం మరియు ప్రాసెస్ చ...