యంగ్ ఇండియా జాతీయ సేవా పురస్కార్ అవార్డు అందుకున్న.. అదిలాబాద్ వాసి అబ్దుల్ అజీజ్

 వార్త నేత్రం 29 అక్టోబర్ 2024:   ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన   బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవలను  గుర్తించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన  యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు యంగ్ ఇండియా సేవా పురస్కారం 2024 ప్రకటించి వారికి   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల పంపిణి  కార్యక్రమం లో ఆహుతులు .ఆర్టిసి ఎండి సజ్జనార్ , నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఏలూరు శ్రీనివాసరావు తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్  అసోసియేషన్ అధ్యక్షుడు. మరియు చైర్మన్, ఫౌండర్, ప్రెసిడెంట్ జే.బాలు, వెంకట పుల్లయ్య చీఫ్ అడ్వైజర్ యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ , ల చేతుల మీదుగా బెస్ట్ ఫ్రెండ్స్  హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కు  యంగ్ ఇండియా సేవా పురస్కారం జాతీయ అవార్డును  అందుకున్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
 ఎక్కడో దూరంగా ఉన్న అదిలాబాద్ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా   చేస్తున్న  సేవలను గుర్తించి మా సంఘాన్ని ఎంపిక చేయడం,సంతోషకరం గా వుందని తెలిపారు . అవార్డును అందజేసిన... యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ క్లబ్ కు  బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్  సొసైటీ తరఫున, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు అబ్దుల్ అజీజ్ తెలిపారు.... ఈ కార్యక్రమంలో సొసైటీ అడ్వైజర్ బ్రహ్మ సతీష్, సాబీర్ హుస్సేన్, ఉపాధ్యక్షుడు పాలకొండ శ్రీకాంత్, సభ్యుడు హుస్సేన్ తది తరులు పాల్గొన్నారు...


Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్