బెంగళూరులో అన్నమయ్య జిల్లా యువతి దారుణ హత్య..

వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:నవంబర్ 25

కర్ణాటక రాజధాని బెంగ ళూరులో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి దారుణ హత్యకు గురైంది. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం, బిక్కంగారిపల్లికి చెందిన దేవశ్రీ (21) అనే విద్యార్థిని హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగు చూసింది.... 

ఉన్నత చదువులతో ఉజ్వల భవిష్యత్తును ఊహించుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.వివరాల్లోకి వెళితే.. రెడ్డప్ప,జ‌గ‌దాంబ దంప‌తుల కుమార్తె అయిన దేవశ్రీ బెంగళూరులోని ఆచార్య కళాశాలలో బీబీఏ నాలుగో సంవత్సరం చదువుతోంది. చదువు నిమిత్తం అక్కడే ఓ అద్దె గదిలో నివసిస్తోంది. 

ఆమెకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండ మర్రికి చెందిన ప్రేమ్ వర్ధన్, అనే యువకుడి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గాని నిందితుడు దేవశ్రీ అనే విద్యార్థినిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దేవశ్రీ తలపై బలంగా మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తిం చారు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. 

మదనాయ‌నకహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రేమ్ వర్ధన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి వస్తుందనుకున్న కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుము న్నీరుగా విలపిస్తున్నారు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్