ఈనెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం


వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:నవంబర్ 21

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధ్యక్షతన ఈనెల 25న సెక్రటేరియట్‌ లో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమా వేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్‌పై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్‌లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధ తపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. 

అదేవిధంగా పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం వంటి అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థ వంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్