ఫారెస్ట్ కాలేజీని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్


 


సిద్దిపేట  :ములుగులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ సెంటర్ (FCRI)ను సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు. రూ.75 కోట్ల వ్యయంతో ఈ సెంటర్‌ను నిర్మించారు. ఉద్యానవనాల అభివృద్ధి, పరిశోధన కోసం ములుగులో ఏర్పాటుచేసిన తెలంగాణ ఉద్యాన వర్సిటీని కూడా సీఎం ప్రారంభించనున్నారు.ఇప్పటి వరకూ దూలపల్లిలో నిర్వహిస్తున్న ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌ను ఇక నుంచి ములుగులో నిర్వహిస్తారు.దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ క్యాంపస్‌లో 2016లో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు ప్రారంభమైంది. ఇప్పటికే మూడు బ్యాచులు పూర్తయ్యాయి. ఎఫ్‌సీఆర్ఐలో వచ్చే ఏడాది నుంచి ఎమ్మెస్సీ, 2022 నుంచి పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.


ఇటీవలే అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో.. అమెరికాకు చెందిన ఆబర్న్ యూనివర్సిటీ, ఎఫ్‌సీఆర్‌ఐ మధ్య ఎంవోయూ కుదిరింది. విద్యాసంబంధ విషయాలపై పరస్పర అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి.
తమిళనాడు స్ఫూర్తితో..
తమిళనాడు ప్రభుత్వం మెట్టుపాళ్యంలో చాలా ఏళ్ల క్రితమే ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ చదువుకున్న వారిలో దాదాపు 120 మంది ఐఎఫ్ఎస్ అధికారులుగా ఎంపికయ్యారు. దీన్ని స్పూర్తిగా తీసుకున్న కేసీఆర్ సర్కారు.. తెలంగాణ విద్యార్థులను కూడా ఐఏఎఫ్ అధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2016లో ఎఫ్‌సీఆర్ఐను ఏర్పాటు చేసింది.


Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్