Posts

నేడు గ్రూప్‌-1 తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

Image
వార్త నేత్రం ప్రతినిధి:  హైదరాబాద్  Jan 22,  నేడు గ్రూప్‌-1 తుది తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ తెలంగాణ : తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్షపై గురువారం తీర్పు వెల్లడించనుంది. ఉదయం 11 గంటలలోపు ఈ తీర్పు వెలువడనుంది. ఈ తీర్పుతో అపాయింట్‌మెంట్ లేటర్లు అందుకున్న 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం తేలనుంది. టీజీపీఎస్సీ 2024లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని, ఫలితాలను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. మూల్యాంకనంలో అక్రమాలు, జెల్‌ పెన్నుల వాడకం, కొన్ని పరీక్షా కేంద్రాల నుంచే ఎక్కువ మంది ఎంపిక కావడం వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పరీక్షలు రద్దు చేయొద్దని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు తుది తీర్పు వెల్లడించనుంది.

త్వరలో మహిళలకు 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు' పంపిణీ!

Image
వార్త నేత్రం ప్రతినిధి: హైదరాబాద్  Jan 22,  త్వరలో మహిళలకు 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు' పంపిణీ! తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో త్వరలో కీలక మార్పులు రానున్నాయి. మహిళలకు 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు' పంపిణీకి ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డులు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ కోసం జీరో టికెట్ పొందుతున్న విషయం తెలిసిందే. చిప్‌తో కూడిన ఈ కార్డులో 16 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. కార్డు ముందు భాగంలో మహిళ ఫోటోతో పాటు పేరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలు ముద్రించి ఉంటాయి.

మేడారం భక్తులకు అలర్ట్.. వాట్సప్ లో 'Hi' మెసేజ్ చేస్తే జాతర వివరాలు

Image
వార్త నేత్రం ప్రతినిధి: మేడారం Jan 22,  మేడారం భక్తులకు అలర్ట్.. వాట్సప్ లో 'Hi' మెసేజ్ చేస్తే జాతర వివరాలు తెలంగాణ : మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు ఘనంగా జరగనుంది. అయితే జాతరకు వెళ్లే భక్తులకు కోసం రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. భక్తులు 7658912300 నంబర్కి 'Hi' అని మెసేజ్ చేస్తే లాంగ్వేజ్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన భాషను ఎంచుకొని జాతర సమాచారం, ట్రాఫిక్ &రవాణా అప్డేట్స్, వాతావరణ సమాచారం, అత్యవసర సహాయం వంటి వివరాలు పొందవచ్చు.

నేటి నుండి మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 22 తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు .. ఈనెల 28, 29, 30, 31, తేదీల్లో మహా జాతర జరగనుండగా.. భక్తులకు సౌకర్యనార్థం హన్మకొండ, నుంచి మేడారం వరకు పది రోజులపాటు.. హెలిక్యాప్టర్ సేవలు భక్తులకు అందు బాటులో ఉంటాయని టూరిజం శాఖకు చెందిన అధికారులు తెలిపారు.  ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ మేడారంలో భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది, హనుమకొండ నుండి మేడారం వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి 35 వేల 999 రూపాయలు వసూల్ చేస్తారు. ఇందు కోసం మేడారంలోని పడి గాపూర్, దగ్గర హెలిప్యాడ్, ఏర్పాటు చేశారు.మేడారం ఏరియల్ "వ్యూ" వీక్షించేందుకు హెలికాప్టర్ సేవలు అందు బాటులో ఉంటాయని టూరిజం శాఖ తెలిపింది, టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను మంత్రి సీతక్క గురువారం ప్రారంభించనున్నారు.  కాగా విహంగ వీక్షణ జాయ్ రైడ్స్ కు ఒక్కరికి 4,800 రూపాయలు చార్జితో ఏడు నిమిషాలు హెలికాప్టర్లో ఏరియల్ "వ్యూ" వీక్షించేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి,సర్కార్ భరోసా!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 10 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓ శుభవార్త అందించింది, ఉద్యోగుల సంక్షేమం కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం సాయంత్రం భారీ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది శాశ్వత పర్మినెంట్ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా స్పష్టం చేశారు.  కేవలం ప్రకటనలకే పరిమి తం కాకుండా.. ఈ బీమా పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే లోతైన సంప్రదింపులు జరిపిందని ఆయన వివరించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సవాళ్లు, ఇబ్బందుల ఉన్నప్పటికీ, ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.  గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల ను సైతం తాము అధికారం లోకి వ...

త్వరలో షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: జనవరి 09  చెక్ పోస్టులు ఎత్తేసిన రవాణా శాఖలో మరో కీలక సంస్కరణ అమలుకు సిద్ధమవుతుంది, కొత్తగా వ్యక్తిగత వాహనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది, త్వరలో వాహనం కొనుగోలు చేసిన షో రూమ్ లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ శాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు.  దీంతో రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఇకపై బైక్, కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో  కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాహనాలు కొనుగోలు చేసిన షోరూమ్ లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేయనుంది, రవాణ శాఖ. ప్రైవేట్ నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఈ కొత్త విధానం అమలు కానుంది. *ఇప్పటివరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్..* ఇప్పటివరకు ఉన్న విధానంలో కొత్త వాహనం కొనుగోలు చేస్తే డీలర్లు కేవలం తాత్కాలిక రిజి స్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఇచ్చేవారు. శాశ్వత రిజిస్ట్రే షన్ కోసం రవాణశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చ...

గవర్నర్ కు బాంబు బెదిరింపు?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 09 పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిన్ను బాంబు పెట్టి పేల్చివేస్తాం అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో గురువారం అర్ధరాత్రి లోక్ భవన్ రాజ్‌భవన్, వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.  ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది,గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.  అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి.  గవర్నర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయనకు హెచ్చరికలు అందాయి. అయితే తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ బెదిరింపును అధికా...