Posts

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్

Image
హైదరాబాద్, డిసెంబర్ 12 వార్త నేత్రం ప్రతినిధి : ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) పిటిషన్ దాఖలు చేశారు. భారత రాజ్యాంగం 32వ ఆర్టికల్ కింద అక్టోబర్ 14న ఈ పిటిషన్ సమర్పించగా, అది దాఖలైనది త్వరలో విచారణకు వస్తుందని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి, పథకాల కోసం ఎంత నిధులు కేటాయిస్తోంది, వాటిని ఎందుకోసం ఖర్చు చేస్తోందో పూర్తి వివరాలు ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉండాలని అందె రఘు పిటిషన్‌లో స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా ప్రతి సారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా స్వచ్ఛందంగా వెబ్‌సైట్‌లలో పొందుపరచాలని కోరారు. ప్రజాధనం ఖర్చుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటే ప్రతి రూపాయి ఎక్కడ, ఎందుకు ఖర్చు అవుతోందో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య పారదర్శకత పెరిగి అవినీతి తగ్గుతుందని వారు తెలిపారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

రేపు తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం!

Image
వార్త నేత్రం :  ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 10 తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 11, గురువారం నాడు జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  తొలి విడత ప్రచారానికి గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం జరగబోయే పోలింగ్ కోసం ఇప్పటికే మండల కేంద్రాలకు బ్యాలెట్ పేపర్లు, బాక్సులు పంపించారు. బుధవారం వీటిని గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నా రు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నిక లను పర్యవేక్షించనున్నారు. మూడు విడతల్లో జరిగే స్థానిక పంచాయతీ ఎన్నికల కోసం మొత్తం 10 వేలకు పైగా కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నా రు. తొలి విడతలో 3 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నా రు. ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించాలి. ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ మొదలు పెట్టా...

దేశవ్యాప్తంగా 25 వేల 487 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్!

Image
వార్త నేత్రం : ప్రతినిధి    హైదరాబాద్:డిసెంబర్ 10 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025 సంవత్సరానికి కేంద్ర సాయుధ పోలీస్ బలగాలలో బిఎస్ఎఫ్, సిఆర్ పి ఎఫ్, ఐటిబిపి, సీఐఎస్ఎఫ్, ఏ ఆర్, ఎస్ఎస్ఎఫ్,ఎస్ ఎస్ బి, మొత్తం 25,487, కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది.  అభ్యర్థులు తమ దరఖాస్తు లను 2025 డిసెంబర్ 31లోపు సమర్పించాలి. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలలో పురుషులకు 23,467 పోస్టులు కేటాయించగా.. మహిళలకు 2,020 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.  ఈ నియామకాల ద్వారా వివిధ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), అస్సాం రైఫిల్స్, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ SSFలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.... ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.  *అభ్యర్థుల వయస్సు*  జనవరి 1-01-2026 నాటికి 18 నుండి 23 సంవత్సరాలు ఉండాలి! *వయసు సడలింపు!*  ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు లో సడలి...

తెలంగాణ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్!

Image
వార్త నేత్రం: ప్రతినిధి  హైదరాబాద్: డిసెంబర్‌10 తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలుత ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి.  ఆ తర్వాత మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈసారి పదవ తరగతి పరీక్షల్లో సమయంలో హాలిడేస్ రావడంతో ఒక్కో పరీక్షకు నాలుగు,ఐదు,రోజుల గ్యాప్ వస్తుంది,ప్రతి పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించి నున్నారు.  సైన్స్ పేపర్ రెండు భాగాలుగా రెండు రోజులు జరగనున్న నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు సైన్స్ పేపర్ 1, పేప 2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్! *పూర్తి షెడ్యూల్ వివరాలు* 14 మార్చి 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ 18 మార్చి 2026 – సెకెండ్ లాంగ్వేజ్ 23 మార్చి 2026 – థర్డ్ లాంగ్వేజ్ 28 మార్చి 2026 – మాథెమాటిక్స్ 02 ఏప్రిల్ 2026 – ఫిజికల్ సైన్స్ 07 ఏప్రిల్ 2026 –...

సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్

Image
వార్త నేత్రం:న్యూస్ ప్రతినిధి  హైదరాబాద్, డిసెంబర్ 07  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తేడా లేదని.. ఈ రెండు కుటుంబ, అవినీతి పార్టీలేనని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలంటూ తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మిగుల రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మనం చూశామని.. కేసీఆర్ కుటుంబ పాలన ఎంత అవినీతి చేసిందో అందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెచ్చుకున్న ఈ ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో ఆనాడు బందీ అయిపోయిందని విమర్శించారు. కాంగ్...

ఆ ఆలయంలో.. మంగళవారం మాంసంతో భోజనం!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి  హైదరాబాద్ డిసెంబర్ 07. హైదరాబాద్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట పట్టణం ఉంది. అక్కడి వ్యవసాయ మార్కెట్‌ యార్డు సమీపంలోని చింతల్‌ చెరువు వద్ద వెలసిన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. అక్కడ ప్రతీ మంగళవారం మాంసంతో భక్తులకు భోజనం పెడతారు. పట్టణానికి చెందిన అందే కృష్ణారెడ్డి పూర్వీకులు రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు పసుపులో వెలిసిందని చెబుతూ... తమకు చెందిన 6 ఎకరాల 12 గుంటల స్థలాన్ని ఆలయం కోసం కేటాయించారు. ఆ తల్లినే వారు ఇలవేల్పుగా కొలిచేవారట. ఆ స్థలంలోనే చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు. అయితే తరాలు మారుతున్న కొద్దీ వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ ప్రాంతం మినహా మిగతా స్థలాన్ని ఇతరులకు అమ్మేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం కృష్ణారెడ్డి కుటుంబంలోని ఒక మహిళకు అమ్మవారు కలలో ప్రత్యక్షమై, ఆ స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలని సూచన చేసిందట. దాంతో అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆ స్థలంలో రూ. 25 లక్షల సొంత డబ్బుతో ఆలయాన్ని పునర్నిర్మించారు. అప్పటి నుంచి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి భక్తుల రాకపోకలు ఊపందుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాక... చింతల...

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్,ఈవెంట్ కు అంత సిద్ధం!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 07 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ నున్న గ్లోబల్ సమ్మిట్ కు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లోని ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాటు చేస్తుంది, 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి నాలుగు చోట్ల పార్కింగ్ స్లాట్లను కూడా కలుపుకుంటే మొత్తం 500 ఎకరాల భూమిని సమ్మిట్ కోసం వినియోగిస్తున్నట్లు తెలు  స్తుంది.. రేపు మధ్యా హ్నం వరకల్లా ఏర్పాట్లన్నీ పూర్త వుతాయని అధికా రులు చెబుతున్నారు.  దానికంటే ముందుగా ఈరోజు ఆదివారం ఏర్పాట్ల ను పరిశీలించడానికి డ్రై రన్ ను నిర్వహించనున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8,9, తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 కు దేశ విదేశాలకు చెందిన దిగ్గ జాలు తరలిరానున్నారు తెలంగాణ రైజింగ్ థిమ్ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పరిశ్రమల అధినేతలు ఇన్నో నెటర్లు, పాలసీ మేకర్లు,సినీ, క్రీడా, విద్య, రంగాలకు చెందిన ప్రము ఖులు విదేశీ రాయబారులు వివిధ రంగాలకు చెందిన నీస్టాతులను ఒకే వేదిక పైకి తీసుకొస్తుంది,  సదస్సులో పాల్గొనవల సిందిగా..రాష్ట...