దేశవ్యాప్తంగా 25 వేల 487 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్!
వార్త నేత్రం : ప్రతినిధి
హైదరాబాద్:డిసెంబర్ 10
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025 సంవత్సరానికి కేంద్ర సాయుధ పోలీస్ బలగాలలో బిఎస్ఎఫ్, సిఆర్ పి ఎఫ్, ఐటిబిపి, సీఐఎస్ఎఫ్, ఏ ఆర్, ఎస్ఎస్ఎఫ్,ఎస్ ఎస్ బి, మొత్తం 25,487, కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
అభ్యర్థులు తమ దరఖాస్తు లను 2025 డిసెంబర్ 31లోపు సమర్పించాలి. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలలో పురుషులకు 23,467 పోస్టులు కేటాయించగా.. మహిళలకు 2,020 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ఈ నియామకాల ద్వారా వివిధ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), అస్సాం రైఫిల్స్, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ SSFలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు....
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
*అభ్యర్థుల వయస్సు*
జనవరి 1-01-2026 నాటికి 18 నుండి 23 సంవత్సరాలు ఉండాలి!
*వయసు సడలింపు!*
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు లో సడలింపు ఉంటుంది,ఓ బి సి, కి మూడు సంవత్సరాలు ఎస్సీ,ఎస్టీ,కి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది!
*జీతం*
ఎంపికైన అభ్యర్థులకు నెలకు దాదాపురూ " 21,700 నుండి రూ" 69,100 వరకు జీతం, ఉంటుంది.. అలాగే ఇతర అలవెన్సులు లభిస్తాయి.
Comments
Post a Comment