Posts

Showing posts from December, 2025

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్

Image
హైదరాబాద్, డిసెంబర్ 12 వార్త నేత్రం ప్రతినిధి : ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) పిటిషన్ దాఖలు చేశారు. భారత రాజ్యాంగం 32వ ఆర్టికల్ కింద అక్టోబర్ 14న ఈ పిటిషన్ సమర్పించగా, అది దాఖలైనది త్వరలో విచారణకు వస్తుందని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి, పథకాల కోసం ఎంత నిధులు కేటాయిస్తోంది, వాటిని ఎందుకోసం ఖర్చు చేస్తోందో పూర్తి వివరాలు ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉండాలని అందె రఘు పిటిషన్‌లో స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా ప్రతి సారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా స్వచ్ఛందంగా వెబ్‌సైట్‌లలో పొందుపరచాలని కోరారు. ప్రజాధనం ఖర్చుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటే ప్రతి రూపాయి ఎక్కడ, ఎందుకు ఖర్చు అవుతోందో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య పారదర్శకత పెరిగి అవినీతి తగ్గుతుందని వారు తెలిపారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

రేపు తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం!

Image
వార్త నేత్రం :  ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 10 తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 11, గురువారం నాడు జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  తొలి విడత ప్రచారానికి గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం జరగబోయే పోలింగ్ కోసం ఇప్పటికే మండల కేంద్రాలకు బ్యాలెట్ పేపర్లు, బాక్సులు పంపించారు. బుధవారం వీటిని గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నా రు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నిక లను పర్యవేక్షించనున్నారు. మూడు విడతల్లో జరిగే స్థానిక పంచాయతీ ఎన్నికల కోసం మొత్తం 10 వేలకు పైగా కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నా రు. తొలి విడతలో 3 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నా రు. ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించాలి. ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ మొదలు పెట్టా...

దేశవ్యాప్తంగా 25 వేల 487 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్!

Image
వార్త నేత్రం : ప్రతినిధి    హైదరాబాద్:డిసెంబర్ 10 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025 సంవత్సరానికి కేంద్ర సాయుధ పోలీస్ బలగాలలో బిఎస్ఎఫ్, సిఆర్ పి ఎఫ్, ఐటిబిపి, సీఐఎస్ఎఫ్, ఏ ఆర్, ఎస్ఎస్ఎఫ్,ఎస్ ఎస్ బి, మొత్తం 25,487, కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది.  అభ్యర్థులు తమ దరఖాస్తు లను 2025 డిసెంబర్ 31లోపు సమర్పించాలి. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలలో పురుషులకు 23,467 పోస్టులు కేటాయించగా.. మహిళలకు 2,020 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.  ఈ నియామకాల ద్వారా వివిధ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), అస్సాం రైఫిల్స్, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ SSFలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.... ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి.  *అభ్యర్థుల వయస్సు*  జనవరి 1-01-2026 నాటికి 18 నుండి 23 సంవత్సరాలు ఉండాలి! *వయసు సడలింపు!*  ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు లో సడలి...

తెలంగాణ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్!

Image
వార్త నేత్రం: ప్రతినిధి  హైదరాబాద్: డిసెంబర్‌10 తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలుత ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి.  ఆ తర్వాత మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈసారి పదవ తరగతి పరీక్షల్లో సమయంలో హాలిడేస్ రావడంతో ఒక్కో పరీక్షకు నాలుగు,ఐదు,రోజుల గ్యాప్ వస్తుంది,ప్రతి పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించి నున్నారు.  సైన్స్ పేపర్ రెండు భాగాలుగా రెండు రోజులు జరగనున్న నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు సైన్స్ పేపర్ 1, పేప 2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్! *పూర్తి షెడ్యూల్ వివరాలు* 14 మార్చి 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ 18 మార్చి 2026 – సెకెండ్ లాంగ్వేజ్ 23 మార్చి 2026 – థర్డ్ లాంగ్వేజ్ 28 మార్చి 2026 – మాథెమాటిక్స్ 02 ఏప్రిల్ 2026 – ఫిజికల్ సైన్స్ 07 ఏప్రిల్ 2026 –...

సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్

Image
వార్త నేత్రం:న్యూస్ ప్రతినిధి  హైదరాబాద్, డిసెంబర్ 07  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తేడా లేదని.. ఈ రెండు కుటుంబ, అవినీతి పార్టీలేనని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలంటూ తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మిగుల రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మనం చూశామని.. కేసీఆర్ కుటుంబ పాలన ఎంత అవినీతి చేసిందో అందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెచ్చుకున్న ఈ ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో ఆనాడు బందీ అయిపోయిందని విమర్శించారు. కాంగ్...

ఆ ఆలయంలో.. మంగళవారం మాంసంతో భోజనం!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి  హైదరాబాద్ డిసెంబర్ 07. హైదరాబాద్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట పట్టణం ఉంది. అక్కడి వ్యవసాయ మార్కెట్‌ యార్డు సమీపంలోని చింతల్‌ చెరువు వద్ద వెలసిన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. అక్కడ ప్రతీ మంగళవారం మాంసంతో భక్తులకు భోజనం పెడతారు. పట్టణానికి చెందిన అందే కృష్ణారెడ్డి పూర్వీకులు రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు పసుపులో వెలిసిందని చెబుతూ... తమకు చెందిన 6 ఎకరాల 12 గుంటల స్థలాన్ని ఆలయం కోసం కేటాయించారు. ఆ తల్లినే వారు ఇలవేల్పుగా కొలిచేవారట. ఆ స్థలంలోనే చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు. అయితే తరాలు మారుతున్న కొద్దీ వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ ప్రాంతం మినహా మిగతా స్థలాన్ని ఇతరులకు అమ్మేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం కృష్ణారెడ్డి కుటుంబంలోని ఒక మహిళకు అమ్మవారు కలలో ప్రత్యక్షమై, ఆ స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలని సూచన చేసిందట. దాంతో అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆ స్థలంలో రూ. 25 లక్షల సొంత డబ్బుతో ఆలయాన్ని పునర్నిర్మించారు. అప్పటి నుంచి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి భక్తుల రాకపోకలు ఊపందుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాక... చింతల...

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్,ఈవెంట్ కు అంత సిద్ధం!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 07 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ నున్న గ్లోబల్ సమ్మిట్ కు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లోని ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాటు చేస్తుంది, 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి నాలుగు చోట్ల పార్కింగ్ స్లాట్లను కూడా కలుపుకుంటే మొత్తం 500 ఎకరాల భూమిని సమ్మిట్ కోసం వినియోగిస్తున్నట్లు తెలు  స్తుంది.. రేపు మధ్యా హ్నం వరకల్లా ఏర్పాట్లన్నీ పూర్త వుతాయని అధికా రులు చెబుతున్నారు.  దానికంటే ముందుగా ఈరోజు ఆదివారం ఏర్పాట్ల ను పరిశీలించడానికి డ్రై రన్ ను నిర్వహించనున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8,9, తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 కు దేశ విదేశాలకు చెందిన దిగ్గ జాలు తరలిరానున్నారు తెలంగాణ రైజింగ్ థిమ్ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పరిశ్రమల అధినేతలు ఇన్నో నెటర్లు, పాలసీ మేకర్లు,సినీ, క్రీడా, విద్య, రంగాలకు చెందిన ప్రము ఖులు విదేశీ రాయబారులు వివిధ రంగాలకు చెందిన నీస్టాతులను ఒకే వేదిక పైకి తీసుకొస్తుంది,  సదస్సులో పాల్గొనవల సిందిగా..రాష్ట...

E-paper

Image
click link below 👇  Vartha nethram E- paper 

Today E-paper

Image
Click link below 👇  https://online.fliphtml5.com/Varthanethram/qosg/  

Vartha nethram E-PAPER TODAY

Image
Click link below 👇  www.varthanethram.com

మేడారం అభివృద్ధి ప‌నుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి!

Image
వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి హైద‌రాబాద్‌:డిసెంబర్ 01 మేడారం అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌తాప్ర‌మాణాలు పాటించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, అధికారుల‌ ను ఆదేశించారు. ఏమాత్రం పొరపాట్లు దొర్లిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి ప‌నులను ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించా ల‌ని, ఆయన అధికారులకు సూచించారు.. మేడారం అభివృద్ధి ప‌నుల‌పై త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, సోమ‌వారం స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు. రాతి ప‌నుల‌తో పాటు ర‌హ‌దారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గ‌ద్దెల చుట్టూ భ‌క్తుల రాక‌పోక‌ల‌కు సంబంధించిన మార్గాలు, భ‌క్తులు వేచి చూసే ప్ర‌దేశాలు ఇలా ప్ర‌తి ఒక్క అంశంపైనా ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు.  ప‌నులు సాగుతున్న తీరుపై ప్ర‌ద‌ర్శించిన‌ పవ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్‌ను ప‌రిశీలించిన ముఖ్య‌మంత్రి ప‌లు ప్రాంతాల్లో తీసుకోవా ల్సిన జాగ్ర‌త్త‌ల‌ను సూచించారు.ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ‌, దేవాదాయ శాఖ‌, అట‌వీ శాఖ‌, స్థ‌ప‌తి శివ‌నాగిరెడ్డి స‌మ‌న్వ‌యం తో సాగాలని సీఎం సూచించారు. అభివృద్ధి ప‌నుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్ర‌దాయాలు, ఆ...

ఏపీకి దిత్యాహ్ తుఫాన్ గండం?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి అమరావతి'డిసెంబర్ 01 ఏపీలో ప్రభావం చూపిస్తున్న దిత్వాహ్ తుపాన్ క్రమంగా బలహీనపడుతుంది. తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంబడి ఉత్తరం వైపు కదులుతూ భయపెట్టిన సైక్లోన్.. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈరోజు అది మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.  ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో దిత్వాహ్ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర వాయు గుండంగా బలహీనపడిం దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.  సోమవారం ఉదయం వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. సోమవారం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం దిత్వా తుపాను నెమ్మదిగా కదులుతోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం దిశగా వస్తూ ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ సమయంలో ఏపీలోని తిరుపతి...

నేటి నుండి తెలంగాణలో ప్రజా పాలన ఉత్సవాలు!

Image
వార్త నేత్రం  :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 01 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9 నాటికి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భం గా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం సాయంత్రం సచివాలయంలో సీఎం, మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి,మాట్లాడుతూ.. అద్భుత పాలసీని జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పారు. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేం దుకు విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేసినట్టు పేర్కొన్నారు. డిసెంబరు 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆదాయం పెంచుతా మని..పేదలకు పంచుతా మని వివరించారు. తెలంగా ణకు రెండో మణిహారం రెడీ చేసుకుంటున్నామని.. రాష్ట్రానికి నాలుగు కొత్త ఎయిర్ పోర్టులు రాబోతున్నాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.  అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు తెస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్‌ 2047 డాక్యుమెంట...

మహిళ స్వయం సహాయక సంఘాలకు మరో 449 అద్దె బస్సుల కొనుగోలుకు సిద్ధం!

Image
వార్త నేత్రం: న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 01 తెలంగాణలో ఆర్టీసీకి అద్దె బస్సులను సమకూర్చడం ద్వారా మహిళా స్వయం సహాక సంఘాలకు ఆర్థికంగా పంట పండింది మొదటి నెలలో రూ" కోటికి పైగా ఆదాయం సమకూర్చింది, దీంతో మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీకి ఇచ్చి అద్దే పొందేలా ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని రూపొందించింది....  దీనికోసం ఆ సంఘాలకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్, పొదుపు నిధులను సమకూర్చింది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లాంఛనంగా ప్రారంభించా రు. మే 20 నుంచి మహిళా సంఘాల కు చెందిన మొత్తం 154 బస్సులను నడుపుతున్నారు.  ఈ నేపథ్యంలోనే తాజాగా సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి నాగిరెడ్డికి ఒక లేఖ రాశారు. మహిళా సమైక్యల ద్వారా నిర్వహించేందుకు వీలుగా మరో449 అద్దె బస్సుల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. అవసరమైన ప్రభుత్వ అనుమతులు మంజూరైన వెంటనే ఈ కొత్త బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తామని ఆమె వెల్లడించారు.  మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలను కల్పించడమే ల...

డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 01 సాధారణంగా క్యాలెండర్‌ లో నెల మారిందంటే.. ఎన్నో కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తుంటాయి. ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి.. చాలా మార్పులు వస్తుంటాయి. కొన్నింటి డెడ్‌లైన్స్ ముగు స్తుంటాయి. ఎక్కువగా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు డిసెంబర్ నెలలో ఏమేం మారనున్నాయో.. ఈ నెలతో ఏం గడువులు ముగియనున్నాయో తెలుసుకుందామా! కొన్ని మార్పులు.. మీ జేబుకు చిల్లుపడేసేవి కూడా ఉండొచ్చు. సాధారణంగానే.. ఒకటో తేదీ వచ్చిందంటే గ్యాస్ ధరలు మారుతుంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా ముఖ్యమైన నిర్ణయాల్లో.. పాన్ కార్డు హోల్డర్లు, పెన్షనర్లు, టాక్స్ పేయర్లకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఎస్బీఐ ఎం-క్యాష్ సర్వీసుల్ని నిలిపివేస్తుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు గడువు ముగుస్తుంది. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్బీఐ ఎం- క్యాష్ సర్వీస్- 2025, నవంబర్ 30 నుంచి ఎస్బీఐ ఎం క్యాష్ సర్వీస్ ఉండదు. అంటే దీని ద్వారా డబ్బు పంపడం, క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. ఆన్‌లైన్‌ఎస్బీఐ, యోనో లైట్ ద్వారా ఎం క్యాష్ సేవల్ని వాడుకోలేరన్న మాట. దీనికి ప్రత్యామ్నా యంగ...

ముగిసిన తొలి దశ నామినేషన్ల పర్వం!

Image
 డిసెంబర్ 1 నుండి అప్పిళ్లకు అవకాశం!  డిసెంబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 01 తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈదశలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఈసారి పంచాయతీ ఎన్నికలకు తీవ్ర పోటీ నెలకొన్నది. యువతరం పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో సర్పంచి పదవికి తీవ్ర పోటీ నెలకొంది. 4,236 గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ నోటిఫై చేయగా, సర్పంచి పదవుల కోసం మొత్తం 25,654 నామినేషన్లు దాఖలయ్యాయి.   చివరిరోజైన శనివారం ఒక్కరోజే 17,940 నామి నేషన్లు దాఖలయ్యాయి. తొలిదశ ఎన్నికల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీలో ఆరుగురు పోటీపడుతున్నా రు. 37,440 వార్డు సభ్యులకు గాను 82,276 నామినేషన్లు దాఖలయ్యా యి. అందులోనూ ఒక్క 29 నే 70,596 నామినేషన్లు దాఖలయ్యాయి.  సగటున ఒక్కో వార్డుకు 2.19 మంది పోటీలో ఉన్నట్లు తేలింది. సర్పంచి, వార్డు సభ్యుల పదవులు పార్టీ రహితంగా నిర్వహి స్తున్నప్పటికీ ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేష...

రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత?

Image
వార్త నేత్రం  :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 01 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.  అనంతరం నటి శోభిత దూళిపాళ్లను నాగ చైతన్య వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహా గానాలు వినిపించాయి కానీ అవేవి నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి. అనేక సార్లు రాజ్ నిడమోరు, సమంత జంటగా విదేశాలో వెకేషన్ లో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయు. కానీ రాజ్ తో రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు సామ్. కానీ వీరు పెళ్లి చేసుకుంటారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా కూడా సమంత, రాజ్ నిడమోరు ఎప్పుడు స్పందించేలేదు.  ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం అందరి ఊహా గానాలకు తెరదించుతూ రాజ్ నిడమోరును పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూరులోకి ఈషా ఫౌండేషన్ లో అతి కొద్దీ మంది బందు మిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా...

కేరళ ముఖ్యమంత్రి కి ఈడీ నోటీసులు?

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 01 కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. సీఎం వ్యక్తిగత కార్యదర్శి తో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్, కూడా ఈ నోటీసు లు అందాయి.. ఈడీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం..  జారీ చేసిన ఈ నోటీసులో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిబంధనలను ఉల్లంఘిం చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, కేఐఐఎఫ్‌బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎమ్ అబ్రహాం కూడా ఈ నోటీసులు అందుకున్నారు.  ఈడీ గత మూడేళ్లుగా ఈ కేసుపై దర్యాప్తు నిర్వహిం చి.. సెప్టెంబర్‌లో తన నివేదికను అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు సమర్పించింది. మసాలా బాండ్ల ద్వారా సేకరించిన నిధులను.. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ భూమి కొను గోలుకు ఉపయోగించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.  కేరళ మౌలిక సదుపాయాల నిధి బోర్డు (కేఐఐఎఫ్‌బీ) 2019 ఏప్రిల్‌లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయడం ద్వారా మసాలా బాండ్ల రూపంలో రూ. 2,150 కోట్లు నిధులను సేకరించింది. ఈ...