Posts

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి అమరావతి:జనవరి 07 ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా పోలవరంలో బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయు డు పర్యటించారు.ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పురోగతి పనులపై ఆయన విజిట్ చేశారు.  2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే పట్టుదల తో ఉన్న ప్రభుత్వం, నిర్మాణ దశలను నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని వీక్షించారు. అనంతరం నేరుగా నిర్మాణ ప్రాంతానికి చేరుకుని కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1, గ్యాప్-2 పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఇంజనీర్లను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. నిర్వాసితుల పునరావాస ప్యాకేజీల ఆర్ అండ్ ఆర్, అమలుప...

జనజీవన స్రవంతిలోకి మరో 26 మంది మావోయిస్టులు!

Image
 వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి  హైదరాబాద్: జనవరి 07 ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సూక్మ జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బ తగిలింది, జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్,ఎదుట బుధవారం మరో 26 మంది మావో యిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల కోటగా పిలవబడే బస్తర్ రీజియన్‌లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది  జనజీవన స్రవంతిలోకి రావాలన్న ప్రభుత్వ పిలుపు మేరకు పోలీసుల పూన నర్కోమ్,కొత్త ఉదయం ప్రచార కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా ఆయు ధాలు వీడుతున్నారు. *కీలక నేతలు.. రూ. 64 లక్షల రివార్డు* లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి ప్రస్థానం పై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను ప్రకటించింది. లొంగిపోయిన 26 మందిపై కలిపి ప్రభు త్వం 64 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. వీరంతా మావోయిస్టు పార్టీకి చెందిన మార్వార్ డివిజన్ మరియు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమిటీ సభ్యులుగా గుర్తించబడ్డారు. ఛత్తీస్‌గఢ్ పోలీసు యంత్రాంగం, సిఆర్పిఎఫ్ అధికారుల సమక్షంలో ఈ లొంగుబాటు ప్రక్రియ జరిగింది. మావోయిస్టు భావజాలం పట్ల విరక్తి చెంద...

మాజీ మంత్రి హరీష్ రావు,కు సుప్రీంకోర్టులో ఊరట!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 05 తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు, ఈరోజు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. హరీష్ రావుతో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావులపై చర్యలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తూ, గతంలో ఈ కేసుకు సంబంధించి ఉన్న న్యాయ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైంది. పిటిషన్లు కొట్టివేత ఈ సందర్భంగా, ఇదే అంశంపై గతంలో దాఖలైన పిటిషన్లను కూడా తాము ఇప్పటికే కొట్టివేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలను హైకోర్టు గతంలో స్టే చేయడం, లేదా కొన్ని వెసులుబాట్లు కల్పించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప...

పునరాలోచన లేదు నా రాజీనామాను ఆమోదించండి :ఎమ్మెల్సీ కవిత! అసెంబ్లీ లో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్సీ కవిత!

Image
వార్త నేత్రం  :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 05 ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యా రు. ఈ క్రమంలో ఆమె కంటతడి పెట్టుకున్నారు. తనకు ఎదురైన అనుభ వాలను శాసనమండలిలో తెలుపుతూ..ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు.నాలుగు కోట్ల మంది ప్రజలకు 40మంది ఎమ్మెల్సీలు ఉంటారు. ఈ అవకాశం దక్కినందుకు నిజామాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కవిత అన్నారు.  బీఆర్ఎస్ పార్టీతో విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను. 20ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిని నేను. 2006 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను అప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒక శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మన బతుకమ్మ మన గౌరవంను చాటిచెప్పే విధంగా ఊరూ రా తిరిగామని, మన భాష ను యాషను కాపాడుకునే విధంగా పోరాటాలు చేశామని కవిత అన్నారు. 2004లో అమెరికాలో ఉద్యోగాలు చేశాను. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పిలుపు మేరకు ఇతర దేశాల్లో ఉన్న రాష్ట్రానికి యువత రావటం జరిగింది. ఆ సమయంలో నేను కూడా ఉద్యమం కోసం వచ్చానని కవిత అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం 2013లో కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి గల అంశాలపైన ఢిల్లీకి ఆహ్వానిం...

మహిళలకు పాడి పరిశ్రమలు?

Image
వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:జనవరి 02 తెలంగాణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి, సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు కేటాయించడంతో పాటు.. మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే, తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆదా యం పెంపుదల, పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందు కు ఇందిరా డెయిరీ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మహిళా స్వయం సహా యక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండేసి పాడి గేదెలు లేదా ఆవులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది. రోజూ 30 లక్షల లీటర్లు వినియోగమ వుతుండగా.. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీకి పాడి రైతులు కేవలం నాలుగు లక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. మిగిలిన 26లక్షల లీటర్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగు మతి చేసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో పాడి పరి శ్రమను ప్రోత్సహ...

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్

Image
హైదరాబాద్, డిసెంబర్ 12 వార్త నేత్రం ప్రతినిధి : ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) పిటిషన్ దాఖలు చేశారు. భారత రాజ్యాంగం 32వ ఆర్టికల్ కింద అక్టోబర్ 14న ఈ పిటిషన్ సమర్పించగా, అది దాఖలైనది త్వరలో విచారణకు వస్తుందని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి, పథకాల కోసం ఎంత నిధులు కేటాయిస్తోంది, వాటిని ఎందుకోసం ఖర్చు చేస్తోందో పూర్తి వివరాలు ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉండాలని అందె రఘు పిటిషన్‌లో స్పష్టం చేశారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా ప్రతి సారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా స్వచ్ఛందంగా వెబ్‌సైట్‌లలో పొందుపరచాలని కోరారు. ప్రజాధనం ఖర్చుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటే ప్రతి రూపాయి ఎక్కడ, ఎందుకు ఖర్చు అవుతోందో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య పారదర్శకత పెరిగి అవినీతి తగ్గుతుందని వారు తెలిపారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

రేపు తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం!

Image
వార్త నేత్రం :  ప్రతినిధి హైదరాబాద్:డిసెంబర్ 10 తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 11, గురువారం నాడు జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  తొలి విడత ప్రచారానికి గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం జరగబోయే పోలింగ్ కోసం ఇప్పటికే మండల కేంద్రాలకు బ్యాలెట్ పేపర్లు, బాక్సులు పంపించారు. బుధవారం వీటిని గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నా రు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నిక లను పర్యవేక్షించనున్నారు. మూడు విడతల్లో జరిగే స్థానిక పంచాయతీ ఎన్నికల కోసం మొత్తం 10 వేలకు పైగా కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నా రు. తొలి విడతలో 3 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నా రు. ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించాలి. ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ మొదలు పెట్టా...