నేడు గాంధీభవన్లో టీపీసీసీ కీలక సమావేశం!


వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:జనవరి 08

రానున్న మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు వ్యూహంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో తీసుకువచ్చిన సవరణలపై నిరసనలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.. 

ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ అను బంధ సంస్థల అధ్యక్షులతో ఈరోజు విస్తృతస్థాయి సమావేశాన్ని గాంధీభవన్లో నిర్వహించనుంది... 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,అధ్యక్షత వహించనున్నారు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్